న్యూఢిల్లీ, జనవరి 2: ఫుడ్ అండ్ కిరాణా ఉత్పత్తుల డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ. 3,628.9 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది వచ్చిన రూ.1,616.90 కోట్ల నష్టంతో పోలిస్తే రెండు రెట్లకు పైగా పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.2,546.90 కోట్ల నుంచి రూ.5,704. 90 కోట్లకు ఎగబాకింది.