న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4:మహీంద్రా గ్రూపునకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్..నూతన శ్రేణి మాడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 40 నుంచి 50 హెచ్పీ విభాగంలో విడుదల చేసిన ఈ మాడళ్లు రూ.6.9 లక్షల ప్రారంభ ధరతో రూ.9.95 లక్షల గరిష్ఠ స్థాయిలో లభించనున్నాయి. వ్యవసాయదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ మాడళ్లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద లభించనున్నాయని స్వరాజ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి హరీష్ చావన్ తెలిపారు. ఈ నూతన శ్రేణి ట్రాక్టర్లను తయారు చేయడానికి రూ.200 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ట్రాక్టర్లలో సగం 40-50 హెచ్పీ విభాగానికి చెందినవన్నారు.