హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ): సిమెంట్ పరిశ్రమ దీర్ఘకాలంపాటు మనుగడ సాగించాలంటే సుస్థిరత ఎంతో అవసరమని గ్రీన్ సిమెంటెక్ 2021 చైర్మన్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ (ఆసియా) హెడ్ ఫిలిప్ మాథ్యూ అన్నారు. భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధిని కొనసాగించడానికి కార్బన్ ఉద్గారాల విడుదలను సున్నా స్థాయికి తీసుకురావటం ఒక్కటే పరిష్కారం కానప్పటికీ ఇది ప్రస్తుతం అవసరమని ఆయన స్పష్టంచేశారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), సిమెంట్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ (సీఎంఏ) సంయుక్తంగా గురువారం ‘గ్రీన్ సిమెంటెక్ 2021’ 17వ వార్షిక సదస్సును వర్చువల్ పద్ధతిలో నిర్వహించాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో ఫిలిప్ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ వినియో గం పెంచడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు. గ్రీన్కో గోల్డ్ ప్లాక్ అవార్డును సాగర్ సిమెంట్కు ప్రకటించారు.