(Big Spending) ప్రస్తుత దీపావళి పండుగ సీజన్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటిపట్టునే ఉన్న జనం.. ఇప్పుడు దీపావళి పండుగను ఎంజాయ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇందుకు ఇంటర్మైల్స్ సర్వేనే నిదర్శనంగా నిలుస్తున్నది. దాదాపు 75 శాతం మంది ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు సిద్ధమంటున్నారంట. ఈ విషయాన్ని ఇంటర్మైల్స్ సర్వే వెల్లడించింది.
కరోన అనంతరం కాలంలో వినియోగదారుల ఖర్చుల అలవాట్లను అంచనా వేసేందుకు ఇంటర్మైల్స్ సంస్థ అధ్యయనం జరిపింది. దేశవ్యాప్తంగా 1,697 మందితో మాట్లాడిన అనంతరం వారి ప్రతిస్పందనల ఆధారంగా అధ్యయన నివేదికను తయారుచేశారు. లాయల్టీ, రివార్డ్ ప్రోగ్రాం సంస్థ అయిన ఇంటర్మైల్స్.. ‘కన్స్యూమర్ స్పెండింగ్ సెంటిమెంట్ ఇండెక్స్ రిపోర్ట్’ పేరుతో తన సెకండ్ ఎడిషన్ను విడుదల చేసింది.
కరోనా వ్యాప్తికి ముందు కంటే పెద్ద షాపింగ్ ఖర్చులు చేయడానికి ఎంత ఓపెన్గా ఉన్నారని ప్రశ్నించగా.. మెజారిటీ ప్రజలు ఆశావాదంతో ప్రతిస్పందించారు. 75 శాతం మంది వారు కరోనా వ్యాప్తికి ముందు లాగా పెద్ద షాపింగ్ ఖర్చులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ పండుగ సీజన్లో బహుమతులపై దృష్టి మసకబారుతోంది. వ్యక్తిగత, గృహ షాపింగ్ పెరుగుతున్నప్పుడు సాధారణంగా బహుమతులు తగ్గిపోవడం సహజం. ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ ప్రాధాన్యత జాబితాలో సంప్రదాయ బహుమతులు లేవని చెప్పారు. ఇది కరోనా వ్యాప్తికి ముందు ఉన్నట్లుగా కాకుండా వీరి ప్రవర్తనల్లో తీవ్రమైన మార్పును సూచిస్తుంది.
స్పందించిన వారిలో 78 శాతం మంది ఆన్లైన్లో షాపింగ్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. లాక్డౌన్ సమయం నుంచి ఈ ధోరణి మరింత పెరిగిపోయింది. వన్-స్టాప్ షాపింగ్ గురించి ప్రశ్నించినప్పుడు.. వారి డెస్టినేషన్ క్లియర్గా అమెజాన్ను సూచిస్తున్నది. దీని తర్వాతి స్థానాల్లో ఫ్లిప్కార్ట్, మియంత్రా, టాటా క్లిప్, స్నాప్డీల్ సంస్థలు ఉన్నాయి.
అధ్యయనంలో పాల్గొన్న వారిలో చాలా మంది క్రెడిట్ కార్డ్ల ద్వారా చెల్లింపులు జరిపేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో అత్యంత ప్రాధాన్య గల చెల్లింపు విధానం ఇదే అని దాదాపు 60 శాతం మంది నమ్ముతున్నారు. రివార్డ్ పాయింట్లను సేకరించడం, క్రెడిట్ స్కోర్లను పెంచుకోవడం, ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలకు కూడబెట్టుకోవడానికి క్రెడిట్ కార్డ్లను స్వైప్ చేసేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు.
20 శాతం మంది యూపీఐ ద్వారా, 10 శాతం మంది డెబిట్ కార్డ్ల ద్వారా, 5 శాతం ఇ-వాలెట్ల ద్వారా లావాదేవీలు చేసేందుకు ఇష్టపడటంతో.. ఈ నగదు రహిత చెల్లింపులు కూడా ప్రజాదరణ పొందాయి. నగదు వినియోగం దాదాపు తగ్గిపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. భారతదేశం ప్రజల్లో కనిపించిన ఈ ప్రవర్తనా ధోరణి కరోనా మహమ్మారి కారణంగా అనేక రెట్లు పెరిగింది. ఒకప్పుడు డిజిటల్ లావాదేవీల పట్ల భయంతో ఉన్న వినియోగదారులు.. ఇప్పుడు అందివస్తున్న భద్రతలో హామీలను పొందుతున్నారు. ఫలితంగా డిజిటల్ లావాదేవీలు నానాటికి పెరుగుతున్నాయి.
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..