హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ) : మొబైల్ ఇంటర్నెట్లో జియో 430 ఎంబీపీఎస్ వేగంతో తొలి స్థానంలో నిలిచినట్టు సర్వే సంస్థ ఊక్లా వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్టెల్ 220 ఎంబీపీఎస్, వొడాఫోన్-ఐడియా 30 ఎంబీపీఎస్ ఉన్నట్లు తెలిపింది.
అదేవిధంగా ఫైబర్ నెట్లోనూ ఎక్సైటల్ వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తుందని తేలింది. ఏప్రిల్లో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, లక్నో, కాన్పూర్ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్న నెట్ స్పీడ్ ఆధారంగా ఈ జాబితా తయారైంది.