న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఇన్వెస్టింగ్ అనేది టీ-20 మ్యాచ్కాదని, టెస్ట్ క్రికెట్లాంటిదని, పట్టువదలని రాహుల్ ద్రావిడ్లా ఇన్వెస్టర్లు వ్యవహరించాలంటూ కొత్తగా విడుదలైన ఒక పుస్తకంలో రచయితలు సూచనలు చేశారు. ఇన్వెస్టర్లు వారి పెట్టుబడుల్లో విజయం సాధించాలంటే ద్రావిడ్ తరహాలో టెక్నికల్ సామర్థ్యాలను, వ్యవహార నిపుణతను, ఓర్పును పెంచుకోవాలని సూచించారు. ముగ్గురు ఇన్వెస్టింగ్ నిపుణులు రాసిన ‘డైమండ్స్ ఇన్ ద డస్ట్: కన్సిస్టెంట్ కాంపౌండింగ్ ఫర్ ఎక్స్ట్రార్డనరీ వెల్త్ క్రియేషన్’ అనే పుస్తకంలో పలు మదుపు అంశాల్ని విశదీకరించారు. వాటిలో కొన్ని:
టెస్ట్ క్రికెట్లో ప్రతిభ కనపర్చడానికి టెక్నికాలిటీ ఒకటే సరిపోదు. తెలివితేటలు, ఏకాగ్రత అవసరం. వీటిని కొత్త ఇన్వెస్టర్లు అర్థంచేసుకోవడం ద్వారా విజయం సాధించగలుగుతారు.
గొప్ప ఇన్వెస్టర్లు కూడా గొప్ప క్రికెటర్లవంటివారే. సాంకేతిక నైపుణ్యంతో పాటు వృద్ధి సాధించాలన్న పట్టుదల కలిగినవారు.
నిరంతరం షేర్ల ధరల్ని చూడటం, వార్తలకు తక్షణమే స్పందించడం, మార్కెట్ కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలించడమే ఇన్వెస్ట్ చేయడమని చాలామంది అనుకుంటుంటారు. కానీ టీ-20లా ప్రతీ బంతిని సిక్సర్ కొట్టడం కాదు ఇన్వెస్టింగ్ అంటే.
మదుపుచేయడం టెస్ట్ క్రికెట్ వంటిది. ప్రతీ బంతినీ ఆడక్కర్లేదు. ఈ క్రమంలో రిస్క్తో కూడిన షేర్లను తొలుత వదిలివేయాలి.రాబడుల్ని పెంచేవి ఏమిటో గుర్తించాలి. అటువంటివి కన్పించగానే వాటిలో పెట్టుబడుల్ని చేయాలి.
అత్యంత కీలకమైనదేమంటే&ఇన్వెస్టింగ్కు లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ఓర్పు ఉండాలి. టెస్ట్ క్రికెట్లోనైనా, ఇన్వెస్టింగ్లోనైనా ఇదే విజయాన్నిస్తుంది.