ముంబై, అక్టోబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలకు తోడు ఎనర్జీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లకు లభించిన మద్దతుతో మంగళవారం 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 549.62 పాయింట్లు లాభపడింది.
ఇంట్రాడేలో 59 వేల పైకి చేరుకున్న సూచీ చివరకు 58,960.60 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 175.15 పాయింట్లు అందుకొని 17,486.95 వద్ద స్థిరపడింది.