Stock Market Close | భారతీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో నష్టాలకు బ్రేక్ వేశాయి. ఉదయం సెన్సెక్స్ లాభాల్లో మొదలైంది. ప్రారంభంలో ఐటీ షేర్లు మార్కెట్కు మద్దతుగా నిలిచాయి. దీంతో మార్కెట్లు ముగిసే వరకు లాభాల్లోనే కొననసాగాయి. ఉదయం సెన్సెక్స్ 71,970.82 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 72,261.40 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్న సెన్సెక్స్ చివరకు 454.67 పాయింట్ల లాభంతో 72,186.09 వద్ద స్థిరపడన్నిఫ్టీ సైతం 21,900 పాయింట్ల ఎగువన స్థిరపడింది. నిఫ్టీ 157.70 పాయింట్లు లాభంతో 21,929.40 వద్ద ముగిసింది.
ట్రేడింగ్లో దాదాపు 1,983 షేర్లు పెరిగాయి. 1,285 షేర్లు పతనమవగా.. 58 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, మారుతీ సుజుకీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టపోయాయి. బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, పవర్ మినహా.. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, మెటల్, ఐటీ ఒక్కొక్కటి ఒకటి నుంచి మూడుశాతం వృద్ధితో లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కోశాతం చొప్పున పెరిగాయి.