Stock Market Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. పొద్దంతా లాభాల్లోనే ట్రేడయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 72,692.16 పాయింట్ల వద్ద లాభంతో ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 72,600.73 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 73,138.73 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 526.02 పాయింట్ల లాభంతో 72,996.31 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 118.95 పాయింట్లు పెరిగి 22,123.65 వద్ద ముగిసింది.
దాదాపు 1564 షేర్లు పురోగమించగా.. 2130 షేర్లు క్షీణించాయి. 104 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ అత్యధికంగా లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో నష్టపోయాయి. సెక్టార్లలో ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియల్టీ, టెలికాం 0.5-1 శాతం పెరిగాయి. మెటల్, ఐటీ, మీడియా 0.3-0.5 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్తో ముగియగా.. స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగింది.