Stock Market Closes | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం పడింది. ఈ వారంలో అమెరికా ఫెడల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నది. ఈ నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరో వైపు క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 86 డాలర్లకుపైగానే ట్రేడవుతున్నది.
క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 72,462.94 పాయింట్ల వద్ద భారీ నష్టంతో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. ఇంట్రాడేలో 72,490.09 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 71,933.35 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 736.38 పాయింట్ల నష్టంతో 72,012.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238.20 పాయింట్లు పతనమై.. 21,817.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 1202 షేర్లు పెరగ్గా.. 2,458 షేర్లు పతనమయ్యాయి.
నిఫ్టీలో టీసీఎస్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కన్స్యూమర్, నెస్లే ఇండియా అత్యధికంగా తగ్గాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్ లాభపడ్డాయి. హెల్త్కేర్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ 1-2 శాతం నష్టపోవడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కోశాతం చొప్పున పడిపోయాయి.