Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సోమవారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సూచీలు ఫ్లాట్గా మొదలయ్యాయి. ఆ తర్వాత కోలుకొని కోలుకున్నాయి. ప్రారంభంలో సూచీలు పడిపోయినా.. తిరిగి పుంజుకున్నాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 73,516.42 పాయింట్ల వద్ద ట్రేడిండ్ మొదలైంది. ఇంట్రాడేలో కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఒక దశలో 74,004.16 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 165.32 పాయింట్ల లాభంతో 73,667.96 వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్లాట్గా ముగిసింది. కిత్రం సెషన్తో పోలిస్తే నిఫ్టీ 22,335.70 పాయింట్ల వద్ద ఫ్లాట్గా మొదలైంది. ఆ తర్వాత 22,452.55 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది.
ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొన్నది. చివరకు 3.05 పాయింట్లు పెరిగి.. 22,335.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఎల్టీఐఎండ్ట్రీ, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్లు నిలిచాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ నష్టపోయాయి. సెక్టోరల్లో ఐటీ మినహా మిగిలిన అన్ని సూచీలు రియాల్టీ ఇండెక్స్ దాదాపు 3.5 శాతం, పీఎస్యూ బ్యాంక్ 2 శాతం చొప్పున క్షీణించగా, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, మెటల్, పవర్ ఇండెక్స్ ఒక్కొక్కటి ఒక్కోశాతం పడిపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం పతనమయ్యాయి.