Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లాభాల్లో పయనించాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 71,292.08 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి నష్టాల్లోకి వెళ్లాయి. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న సూచీలు చివరి వరకు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో ఒక దశలో 70,924.30 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 71,662.74 గరిష్ఠానికి చేరింది. చివరకు 482.70 పాయింట్ల లాభంతో 71,555.19 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం నిఫ్టీ 127.30 పాయింట్లు పెరిగి 21,743.30 వద్ద స్థిరపడింది. దాదాపు 1,284 షేర్లు పురోగమించగా.. 1,994 షేర్లు పతనమయ్యాయి. మరో 62 షేర్లు మారలేదు. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, దివీస్ లేబొరేటరీస్, అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లూజర్స్గా నిలిచాయి. కోల్ ఇండియా, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి.
సెక్టార్ల వారీగా మెటల్ మినహా మిగతా అన్ని సూచీలు బ్యాంక్, హెల్త్కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ 0.4-1.5 శాతం మధ్య పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. ఇదిలా ఉండగా.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో మాతృత సంస్థ వన్97 కమ్యూనికేన్స్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. మంగళవారం ఒకే రోజు 10శాతం నష్టంతో రూ.380కి చేరింది. ఆర్బీఐ తీసుకున్న చర్యల నేపథ్యంలో పేటీఎం షేర్లు ఇప్పటి వరకు 45శాతం వరకు పతనమయ్యాయి.