Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో లాభాల్లోకి దూసుకెళ్లాయి. కిత్రం సెషన్తో పోలిస్తే మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 72,677.51 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది.
ఆ తర్వాత కొద్దిసేపటికి నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో ఒక దశలో 72,081.36 పాయింట కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఆ తర్వాత 73,256.39 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 535.15 పాయింట్ల లాభంతో 73,158.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 162.50 పాయింట్లు పెరిగి.. 22,217.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 1,591 షేర్లు పురోగమించగా.. 1,685 షేర్లు క్షీణించాయి. మరో 77 షేర్లు మాత్రం మారలేదు.
నిఫ్టీలో బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, కోల్ ఇండియా టాప్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటోకార్ప్ లూజర్స్గా నిలిచాయి. రంగాల వారీగా ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, టెలికాం ఒక్కోశాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. అయితే, బ్యాంక్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఒకశాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభపడ్డాయి.