Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా మొదలయ్యాయి. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 74,413.82 పాయింట్ల వద్ద లాభంతో మొదలైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ మరోసారి జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 73,485.12 పాయింట్ల కనిష్ఠానికి తాకగా.. గరిష్ఠంగా 74,501.73 పాయింట్ల చేరుకొని ఆల్ టైమ్ హైకి పెరిగింది. చివరకు 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. కిత్రం సెషన్తో పోలిస్తే నిఫ్టీ 22,592.10 వద్ద లాభంతో మొదలైంది.
ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొన్నది. చివరకు 80 పాయింట్ల లాభంతో 22,514.65 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 2,342 షేర్లు పురోగమించగా.. 1,361 షేర్లు పతనమయ్యాయి. మరో 101 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఓఎన్జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్, పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0.5-1 శాతం, పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.7-1.6 శాతం దిగజారాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.