ముంబై, జూన్3: వరుసగా రెండురోజులపాటు స్తబ్దుగా ముగిసిన స్టాక్ సూచీలు గురువారం కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి 52,154 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 15నాటి 52,154 రికార్డు ముగింపుకంటే అధికం. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 114 పాయింట్లు అధికమై జీవితకాలపు గరిష్ఠస్థాయి 15,690 వద్ద క్లోజయ్యింది. శుక్రవారం వడ్డీ రేట్లపై రిజర్వుబ్యాంక్ పాలసీ వెల్లడికానున్న నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్ఫ్రా షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా టైటాన్ ఇండస్ట్రీస్ 7 శాతం అధికమైంది. పెరిగిన షేర్లలో ఓఎన్జీసీ, లార్సన్ అండ్ టుబ్రో, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లు వున్నాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్ షేర్లు స్వల్పంగా తగ్గాయి. మార్కెట్పై బుల్స్ పట్టుబిగించారని, వడ్డీ రేట్లపై సరళ విధానం కొనసాగుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో వున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.