Jyotiraditya Scindia | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: విమాన ఇంధనాలపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలితప్రాంతాలకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా సూచించారు. కరోనా వైరస్తో కుదేలైన దేశీయ విమానయాన రంగం తిరిగి వృద్ధి బాటపట్టిందని, అయినప్పటికీ అధిక పన్నులతో కొంతమేర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని మంత్రి వ్యాఖ్యానించారు.
విమానయాన సంస్థ నిర్వహణలో ఇంధనం కోసం పెట్టే ఖర్చు 40 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం 12 రాష్ర్టాలు, యూటీలు జెట్ఫ్యూయల్పై 1-4 శాతం వరకు వ్యాట్ను విధిస్తుండగా, మిగతా రాష్ర్టాలు 20-30 శాతం వరకు వసూలు చేస్తున్నాయని చెప్పారు.