శేరిలింగంపల్లి, జూన్ 19 : వినూత్న ఆలోచనలతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెట్టుబడిదారులకు సూచించారు. ఎస్ఏఎస్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో శుక్రవారం ఖాజాగూడలో ఏర్పాటైన హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణకు నిజాయితీతో కూడిన ఆలోచనలతో రావాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మద్దతు, ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్గా ఎదిగిందని, తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.