హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): టీ వర్క్స్ను రాష్ట్ర అకౌంట్స్ జనరల్ సుధా రాజన్ శనివారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను ఈ సందర్భంగా ఆమెకు నిర్వాహకులు వివరించారు.
ముఖ్యంగా కరోనా సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వంటివి ఇక్కడ తయారయ్యాయని, ప్రజల అవసరాలే లక్ష్యంగా సరికొత్త ఆవిష్కరణలను ఔత్సాహికులు చేసేలా అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. దీంతో టీ వర్క్స్ పనితీరు అద్భుతంగా ఉందని, ఇలాంటి ఆవిష్కరణల ప్రోత్సాహక కేంద్రం ఎంతోమందికి మేలు చేస్తుందని రాజన్ కొనియాడారు.