హైదరాబాద్, జూలై 8: పరిశోధన, ఉద్యోగ కల్పన, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంలో స్టార్టప్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ఆర్జేఈవైఎస్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ రెండో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్టార్టప్ల్లో అపారమైన సామర్థ్యాన్ని గుర్తించి మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వాలు, ఇండస్ట్రీవర్గాలు కీలకంగా మారారన్నారు. ఆర్జేఈవైఎస్లో ప్రస్తుతం 50 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో ఈ సంఖ్య 100కి చేరుకునే అవకాశం ఉన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.