Srivari Spices | హైదరాబాద్, ఆగస్టు 5: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మసాల దినుసుల విక్రయ సంస్థ శ్రీవారి స్పైసెస్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతి పొందిన సంస్థ..వచ్చే వారంలో తన వాటాను విక్రయించబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రైస్ బాండ్ ధరను రూ.40 నుంచి రూ.42 శ్రేణిలో నిర్ణయించింది. ఈ నెల 7న ప్రారంభం కానున్న ఈ ఒపెన్ ఆఫర్..9న ముగియనున్నది.
ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.9 కోట్ల వరకు నిధులు సమీకరించాలనుకుంటున్నట్లు కంపెనీ చైర్మన్ రాథి నారాయణ్ దాస్ తెలిపారు. ఈ వాటాల విక్రయం ద్వారా సేకరించిన నిధులను మూలధన, కార్పొరేట్ అవసరాల నిమిత్తం వినియోగించనున్నది. ప్రస్తుతం ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో విక్రయిస్తున్నట్లు, భవిష్యత్తులో మిగతా రాష్ర్టాలకు విస్తరించే అవకాశం ఉన్నదన్నారు.