Sridhar Ramaswamy | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతి వ్యక్తి నాయకత్వం వహించబోతున్నారు. అమెరికా కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న స్నోఫ్లేక్ నూతన సీఈవోగా శ్రీధర్ రామస్వామి నియమితులయ్యారు. ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తున్నట్లు పేర్కొంది.
యూఎస్కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న ఫ్రాంక్ స్లూట్మ్యాన్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో శ్రీధర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ..సంస్థను మరో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తనవంతు కృషి చేయనున్నట్లు ప్రకటించారు. రామస్వామి గతంలో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహించారు.