ఏడాదిన్నర తర్వాత తిరిగి ప్రారంభమైన సర్వీసులు
హైదరాబాద్ శంషాబాద్(నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 3: జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి శ్రీలంక లోని కొలంబోకు నేరుగా విమాన సర్వసులు శుక్రవారం తిరిగి ప్రారంభించినట్లు జీఎమ్మార్ అధికార వర్గాలు ఓ ప్రకటనలలో తెలిపాయి. 19 నెలల విరామం అనంతరం ఉదయం 9.55 గంటలకు 120 మంది ప్రయాణికుల విమానం కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండు సార్లు సోమ, శుక్రవారం మాత్రమే ఈ సర్వీసు నడువనున్నది. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. అత్యంత ప్రధాన పర్యాటక ప్రాంతం కొలంబోకు నేరుగా హైదరాబాద్ నుంచి విమాన సర్వసులు చాలా రోజుల తర్వాత పునః ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. త్వరలో మరిన్ని నూతన గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.