న్యూఢిల్లీ, జూన్ 24: విద్యా సేవల్ని అందిస్తున్న శ్రీచైతన్య గ్రూప్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగంలోకి విస్తరించింది. ఇన్ఫినిటీ లెర్న్ను ఆవిష్కరించడం ద్వారా ఎడ్యూటెక్లోకి ప్రవేశించామని, కొత్త వెంచర్లో రూ.370 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్లు శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ బీఎస్ రావు గురువారం ప్రకటించారు. దశాబ్దాలపాటు విద్యను, విజ్ఞానాన్ని పంచిన తమ గ్రూప్&ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగంలో అత్యున్నతసంస్థగా ఎదగాలన్న లక్ష్యంతో వున్నామని రావు వివరించారు. ఇన్ఫినిటీ లెర్న్ విద్యార్ధులకు ఉచిత మాక్ పరీక్షల్ని ఆఫర్చేస్తుంది. ప్రతీ నెలా కొత్త ఫీచర్లను చేరుస్తామని, సీబీఎస్ఈ విద్యార్థులు బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా ఆరునెలల్లో ఇన్ఫినిటీ లెర్న్ను సిద్ధంచేస్తామని శ్రీచైతన్య సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన తెలిపారు.