న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: సామ్సంగ్నకు చెందిన గెలాక్సీ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. గెలాక్సీ ఏ57, ఏ37 మాడళ్లపై క్యాష్బ్యాక్తోపాటు ఈఎంఐ ఆఫర్లో కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. మూడు రంగుల్లో లభించనున్న 8జీబీ/256 జీబీ రకం ధర రూ.56,999గా నిర్ణయించిన సంస్థ..12జీబీ/256 జీబీ రకం రూ.62, 499కి విక్రయిస్తున్నది. అలాగే ఏ37 5జీ రకంలో 8జీబీ/128 జీబీ మాడల్ ధర రూ.41,999గాను, 8జీబీ/256 జీబీ రకం ధర రూ.47,499గాను, 12 జీబీ/256 జీబీ రకం రూ.52,999కి వి్రక్రయిస్తున్నది. ఈ రెండు మాడళ్లపై జీరో డౌన్పేమెంట్, సున్న వడ్డీకి సామ్సంగ్ ఎక్స్క్లూజివ్, భాగస్వామి స్టోర్లలో కొనుగోలు చేయవచ్చును. వీటితోపాటు రూ.36,999 ప్రారంభ ధరతో లభించనున్న ఇతర రకం ఫోన్లపై రూ.5 వేల బోనస్, ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపిన వారికి రూ.3 వేల క్యాష్బ్యాక్, 24 నెలల జీరో వడ్డీకి ఈఎంఐ ఆప్షన్తో కూడా కొనుగోలు చేయవచ్చును.