ముంబై, జనవరి 22: హైదరాబాద్కు చెందిన సూక్ష్మ రుణాలు అందించే స్పందన స్పూర్తి ఫైనాన్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.127 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 79 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 75 శాతం అధికమై రూ.657 కోట్లకు చేరుకున్నది. ఏడాది క్రితం ఇది రూ.375 కోట్లుగా ఉన్నది. నికర వడ్డీ ఆదాయం 60 శాతం ఎగబాకి రూ.407 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. మొండి బకాయిలు 5.31 శాతం నుంచి 1.51 శాతానికి తగ్గాయి.