న్యూఢిల్లీ : 2040 నాటికి భారత అంతరిక్ష ఆర్ధిక వ్యవస్ధ (Space Economy) ఏకంగా రూ.3.2 లక్షల కోట్లకు ఎదుగుతుందని అప్పటికి శాస్త్రవేత్తలకు కూడా మెరుగైన పని వాతావరణం నెలకొంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, అణు ఇంధన, అంతరిక్ష శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఏకేడీ వంటి కొన్ని విదేశీ సంస్ధలు 2040 నాటికి 100 బిలియన్ డాలర్లకు భారత స్పేస్ ఎకానమీ ఎదుగుతుందని అంచనా వేస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం మన స్పేస్ ఎకానమీ కేవలం 80 లక్షల డాలర్లుగా ఉందని అన్నారు.
విదేశీ శాటిలైట్ లాంఛ్లతో మనం భారీగా ఆర్జించే అవకాశం ఉందని సింగ్ పేర్కొన్నారు. ఇస్రో రాకెట్ లాంఛ్ 60వ వార్షికోత్సవాల నేపధ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా తరహాలో జాతీయ పరిశోధనా ఫౌండేషన్ అనుసంధాన్ ఏర్పాటుతో భారత్లో అంతరిక్ష పరిశ్రమ మెరుగైన వృద్ధి సాధిస్తుందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
Read More :
Pneumonia Cases | న్యుమోనియా కేసుల వ్యాప్తి : రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు