న్యూఢిల్లీ : వివో స్కాం ప్రధాన సూత్రధారి బిన్ లూ భారత్ను విడిచివెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. భారత్ అంతటా వివోను విస్తరించే బాధ్యతలను బిన్ లూకు అప్పగించగా ఆయన చట్ట విరుద్ధ కార్యకలాపాలకు తెగబడ్డాడు. వివో పోన్ల డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి భారత్లో 23 కంపెనీలకు బిన్ లూ కామన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన చాలా కాలంగా భారత్ను విడిచివెళ్లాడని ఇప్పటివరకూ తిరిగి రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వివో దాని అనుబంధ కంపెనీలపై ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు జరిపిన నేపధ్యంలో బిన్ లూ పరారీపై వార్తలు వచ్చాయి. దాదాపు 30 ప్రదేశాల్లో ఈడీ దాడులు జరిపింది. ఈడీ దాడుల సందర్భంగా కంపెనీకి చెందిన పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ లభించడం లేదని దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది. వివో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాగా, అంతకుముందు మరో చైనా మొబైల్ దిగ్గజం షియామికి చెందిన పలు ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.