న్యూఢిల్లీ : అక్టోబర్లో సొనాలిక ట్రాక్టర్స్ ఏకంగా 17,130 ట్రాక్టర్స్ను విక్రయించి 5.5 శాతం వృద్ధి కనబరించింది. 2022 ఆర్ధిక సంవత్సరంలో 6.56 శాతం వృద్ధితో 85,068 యూనిట్లను విక్రయించింది. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాము కస్టమైజ్జ్ ట్రాక్టర్లను వారి ముందుకు తీసుకువస్తున్నామని వీటికి రైతుల నుంచి మెరుగైన స్పందన లభిస్తోందని సొనాలిక ట్రాక్టర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ పేర్కొన్నారు.
తెలంగాణలో రైతుల కోసం తాము రూపొందించిన మహాబలి, మహారాష్ట్ర ప్రాంతంలో చత్రపతి, టైగర్, సికిందర్ డీఎల్ఎక్స్, రాజస్ధాన్లో ప్రవేశపెట్టిన మహారాజ వంటి ప్రీమియం ట్రాక్టర్స్కు మెరుగైన ఆదరణ లభిస్తోందని తెలిపారు. అత్యాధునిక ఫీచర్లతో పాటు స్ధానిక రైతుల అవసరాలకు, మార్కెట్లకు అనుగుణంగా ట్రాక్టర్లను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.