హైదరాబాద్, సెప్టెంబర్ 28: ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ స్మార్ట్ బజార్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 30న ప్రారంభంకానున్న ఈ ప్రత్యేక ఆఫర్లు అక్టోబర్ 4న ముగియనున్నదని తెలిపింది.
ప్యాకేజ్డ్ ఫుడ్, చాక్లెట్లు, శీతల పానియాలు, బాస్మతి బియ్యం, వంటనూనెలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, లగేజీ, దుస్తులపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు 5 కిలోల బియ్యం, 5 లీటర్ల వంటనూనెలు కలుపుకొని రూ.975కి అందిస్తున్నది. ఈ ప్రత్యేక ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ స్మార్ట్ 850కి పైగా స్టోర్లలో లభించనున్నాయి.