స్కోడా ఆటో అనుబంధ ఫోక్స్ వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ అరోరా నియమితులయ్యారు. ఆయన నియామకం మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు ఫోక్స్ వ్యాగన్ ఇండియా ఎండీగా ఉన్న గుర్ ప్రతాప్ బోపరాయ్ గత నెలలో రాజీనామా చేయడంతో పీయూష్ అరోరా నియమితులయ్యారు. ఇండియా 2.0 ప్రాజెక్ట్తోపాటు భారత్లో ఫోక్స్ వ్యాగన్ వ్యాపార విస్తరణకు పీయూష్ అరోరా బాధ్యత వహిస్తారు. భారత్లోని ఫోక్స్ వ్యాగన్ గ్రూపుకు చెందిన ఐదు బ్రాండ్లు.. స్కోడా, ఫోక్స్ వ్యాగన్, ఆడి, పొర్చే, లంబోర్ఘినీ ఆపరేషన్స్ పర్యవేక్షిస్తుంది స్కోడా ఆటో అనుబంధ ఫోక్స్ వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్).
ఇంతకుముందు పీయూష్ అరోరా మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆపరేషన్స్ డైరెక్టర్గా పని చేశారు. భారత్ బిజినెస్కు సారధ్యం వహించేందుకు తమకు ఉన్నతస్థాయిలో అనుభవజ్ఞుడైన నిపుణుడు లభించాడు. భారత్లో ఫోక్స్వ్యాగన్ గ్రూప్ బిజినెస్ను సుస్థిరంగా ఆయన ముందుకు తీసుకెళ్లగలరు అని స్కోడా ఆటో సీఈవో థామస్ స్కాఫర్ ఓ ప్రకటనలో తెలిపారు.
దేశీయ మార్కెట్లోకి ఫోక్స్ వ్యాగన్ నాచ్బ్యాక్ మోడల్ను ప్రవేశపెట్టాలని చూస్తున్నది. స్కోడా కూడా భారత విపణిలో స్లావియా సెడాన్ ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నది. ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ బ్రాండ్లు భారత్లో ఈ ఏడాది ముఖ్యమైన కార్యకలాపాలు చేపట్టనున్నాయి. ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద భారత్ నుంచే ప్రపంచవ్యాప్తంగా కార్లను ఎగుమతులు చేసేందుకు ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ కసరత్తు చేస్తున్నది. కరోనాతోపాటు చిప్ కొరతతో పలు సవాళ్లను ఎదుర్కొన్నా తమ ఐదు బ్రాండ్లలో 76 శాతం వృద్ధి నమోదైంది. అరోరా సారధ్యంలో సుస్థిర వృద్ధి రేటును తమ గ్రూప్ కొనసాగిస్తుందని ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ చైర్మన్ చిరిస్టియన్ వోన్ సీలెన్ వ్యాఖ్యానించారు.