హైదరాబాద్, జూన్ 8: దేశంలో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా రాష్ట్రంలోకి సరికొత్త ఆరు ట్రాక్టర్లను ప్రవేశపెట్టింది. యువో టెక్+ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు 37 నుంచి 50 హెచ్పీల లోపు సామర్థ్యం కలిగినవి. అడ్వాన్స్డ్ 3-సిలిండర్ ఎం-జిప్ ఇంజిన్, 4-వీల్ డ్రైవ్, డ్యూయల్ క్లచ్, స్లిప్టో, 2 స్పీడ్ వంటి ఫీచర్లతో ఈ ట్రాక్టర్లను రూపొందించింది. ఈ ట్రాక్టర్లపై ఆరేండ్ల వ్యారెంటీ ఇస్తున్నది సంస్థ.