న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.2 పెరిగి రూ.46,171కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,169 వద్ద ముగిసింది. ఇక వెండి ధరలు ( Silver price ) ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.209 తగ్గి రూ.62,258కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 62,467 వద్ద ముగిసింది.
ఇదిలావుంటే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,813 అమెరికన్ డాలర్లు పలుకగా.. ఔన్స్ వెండి ధర 24 అమెరికన్ డాలర్లు పలికింది.