హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఆర్ట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
విద్యా సంస్థలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు సైతం డిజైన్లను ఈనెల 21వ లోగా పంపించాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారు silverjubilee\@iiit.ac.in మెయిల్ ఐడీకి పంపించాలని తెలిపారు.