న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రవాస భారతీయులకు ఇక స్వదేశానికి నగదు పంపడం మరింత సులువు కానున్నది. భారత్లో ఉన్న తమ వారికి విదేశాల నుంచి నగదును పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇట్టే పంపవచ్చు. ఈ మేరకు సరిహద్దు నగదు బదిలీ సంస్థ రియా మనీ ట్రాన్స్ఫర్తో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చేతులు కలిపింది. దీంతో ఓ డిజిటల్ వ్యాలెట్లోకి నేరుగా అంతర్జాతీయ రెమిటెన్సుల అనుమతిని పొందిన తొలి భారతీయ వేదికగా పేటీఎం నిలిచింది. అలాగే పేటీఎం వ్యాలెట్ వినియోగదారులతో అనుసంధానమైన తొలి నగదు బదిలీ సంస్థగా రియా మనీ ట్రాన్స్ఫర్ కూడా ఖ్యాతిని ఆర్జించింది. కాగా, ఈ డీల్తో 33.3 కోట్ల పేటీఎం కస్టమర్లకు విదేశాల్లోని తమవారి నుంచి నగదును అందుకోవడం తేలిక కానున్నది. 4.9 లక్షల రిటైల్ ఔట్లెట్లు రియా మనీకి ఉన్నాయి. దీంతో రియా కస్టమర్లు యాప్ లేదా వెబ్సైట్ ద్వారా నగదును పంపించుకోవచ్చు.