భారతీయులు బంగారం కొనుగోలు చేయడానికి పవిత్రమైన పర్వదినాల్లో.. పండుగల్లో ధంతేరస్ ఒకటి. గత పదేండ్లుగా బంగారం కొనుగోళ్లపై వచ్చే రిటర్న్స్తో అది తన ప్రాధాన్యతను నిలుపుకుంటున్నది. ధంతేరస్ నాడు జరిపే బంగారం కొనుగోళ్లపై వార్షిక ప్రాతిపదికన 6.56 శాతం రిటర్న్స్ లభిస్తుండగా, 10 ఏండ్ల ప్రాతిపదికన పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మరీ 5.6 శాతం లాభాలు గడిస్తోంది. కానీ మిగతా అసెట్స్ ఆ స్థాయిలో రిటర్న్స్ తెచ్చి పెట్టలేకపోతున్నాయి.
ఉదాహరణకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 2011 అక్టోబర్ నుంచి ప్రతియేటా 13 శాతం పెరుగుతున్నది. కానీ బంగారం కొనుగోళ్లపై గత ఐదేండ్లలో డబుల్ డిజిట్ రిటర్న్స్ లభించాయి. కానీ గతేడాది మాత్రం స్తంభించిపోవడంతో ప్రతికూల ఫలితాలొచ్చాయి. 2008 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతోపాటు కరోనాను నియంత్రించడానికి గతేడాది విధించిన లాక్డౌన్ వేళ బంగారం ధర అసాధారణ స్థాయిలో దూసుకెళ్లింది.
అయితే బంగారం కొనుగోళ్లపైనే అధికంగా విశ్వాసం ప్రదర్శించొద్దని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆర్థిక రంగం రికవరీతో బంగారం ధరలు స్తంభిస్తున్నాయని గుర్తు చేశారు. ఎకానమీ ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు బంగారం సబ్ఆప్టిమల్ రిటర్న్స్ మాత్రమే అందిస్తోంది. ఇన్వెస్టర్లకు సరిపడా ఆర్థిక లాభాలు పంచివ్వలేకపోయింది. కొన్నేండ్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల కంటే తక్కువ లాభాలు తెచ్చిపెట్టింది బంగారం.
ఇటువంటి పరిస్థితుల్లో పండుగల సీజన్లో 10 శాతం మాత్రమే బంగారం కొనుగోళ్లపై పెట్టుబడి పెట్టాలని బులియన్ అడ్వైజర్లు సూచిస్తున్నారు. ఫిజికల్ బంగారం కొనుగోలు చేయడం కంటే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కొనుగోళ్లపై ఎక్కువ లాభాలు వస్తాయని చెబుతున్నారు. కనుక గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టాలని హితవు పలుకుతున్నారు.