Shell EV Charging Points | రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం.. అందుకు అవసరమైన ఈవీ చార్జింగ్ వసతుల కల్పన ప్రక్రియ జోరందుకుంటున్నది. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఈవీ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటులో తానూ భాగస్వామినవుతానంటున్నది ప్రముఖ ఆయిల్ సంస్థ షెల్. 2030 నాటికి దేశవ్యాప్తంగా 10 వేల ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), రిలయన్స్-బీపీ భాగస్వామ్యంతో పని చేయనున్నది. 100 శాతం గ్రీన్ ఎనర్జీతో షెల్ రీచార్జి చార్జర్లు పని చేస్తాయి.
తొలిదశలో కర్ణాటక రాజధాని బెంగళూరులో గల తన ఫ్యూయల్ స్టేషన్లు యశ్వంత్పూర్, మరాథాల్లి, ఓల్డ్ మద్రాస్ రోడ్, బ్రూక్ ఫీల్డ్, కనక్పురాల్లో ఈ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. కర్ణాటకతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, అసోం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులను విస్తరించనున్నది.
దేశవ్యాప్తంగా ఉన్న 83,888 పెట్రోల్ పంపుల్లో 327 పెట్రోల్ పంపులు షెల్ ఆధీనంలో ఉన్నాయి. బెంగళూరులోని ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ సెగ్మెంట్లకు ఈవీ చార్జర్లు అందుబాటులోకి తెస్తున్నది. అంతే కాదు షెల్ ఫ్యూయల్ స్టేషన్ల పరిధిలో స్టాండలోన్ ఈవీ హబ్లు, హోం చార్జింగ్ అండ్ డిస్టినేషన్ లొకేషన్లలో కస్టమైజ్డ్ చార్జింగ్ సొల్యూషన్స్ అందిస్తుంది.
స్టాండలోన్ ఈవీ హబ్ల్లో తక్కువ టైంలో వాహనాల చార్జింగ్కు 100 కిలోవాట్ల (కేవీ) అండ్ డైరెక్ట్ కరంట్ (డీసీ) ఫాస్ట్ చార్జర్లను అందుబాటులో ఉంచుతుంది. కస్టమర్లు.. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా `షెల్ రీచార్జి ఇండియా యాప్` ద్వారా ఈ చార్జర్ల సేవలు పొందొచ్చు.