న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: అదానీ గ్రూపునకు సంబంధించిన షేర్ల పతనం కొనసాగుతున్నది. హిండెన్బర్గ్ వేసిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రూపు షేర్ల పతనం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 50 శాతం వరకు నష్టపోయిన పలు కంపెనీల షేర్లు సోమవారం మరో 10 శాతం వరకు పతనం చెందాయి. దీంతో ఇప్పటి వరకు అదానీ గ్రూపు సంస్థలు రూ.9.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. అదానీ గ్రూపునకు సంబంధించిన 10 సంస్థల్లో ఆరు షేర్లు నష్టపోగా…నాలుగు మాత్రం తిరిగి కోలుకున్నాయి.
అదానీ బాండ్లకు స్టాండర్డ్ చార్టర్డ్ నో
సిటిగ్రూప్, క్రెడిట్ సూసీ తరహాలోనే స్టాండర్డ్ చార్టర్డ్ సైతం అదానీ గ్రూప్ కంపనీల బాండ్లను మార్జిన్ రుణాలకు కొలాటరల్గా ఆమోదించబోమని ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈటీ నౌ టెలివిజన్ చానల్ సోమవారం తెలిపింది.
అదానీ గ్రూపు కంపెనీల షేర్ల తీరు
అదానీ ట్రాన్స్మిషన్ : -10%
అదానీ టోటల్ గ్యాస్ : -5%
అదానీ గ్రీన్ ఎనర్జీ : -5%
అదానీ విల్మార్ : -5%
అదానీ ఎంటర్ప్రైజెస్ : -1%