హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఒమర్ ఎయిర్వేస్ సంస్థ సరుకు రవాణా సేవలను ప్రారంభించిందని ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పాణికర్ తెలిపారు. హైదరాబాద్ మస్కట్లను కలుపుతూ బోయింగ్ బి737800 బీసీఎఫ్ విమానం సరుకును రవాణా చేస్తుందని వెల్లడించారు. ఈ విమానం హైదరాబాద్ నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలు దేరుతుందని చెప్పారు. నగరం నుంచి ఔషధాలు, గుడ్ల ఎగుమతులను పెంచేందుకు ఈ సర్వీసు దోహదపడుతుందని తెలిపారు. ఈ కొత్త కనెక్టివిటీ ఒమన్,అమెరికా, ఐరోపాకు ఫార్మా ఎగుమతులను పెంచుతుందని పేర్కొన్నారు.