ముంబై, మే 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, బ్యాంకింగ్, వాహన రంగాలకు చెందిన స్టాక్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల అంశాలు కూడా తోడవడంతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి 30 షేర్ల ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 632.13 పాయింట్ల(1.17 శాతం) ర్యాలీతో 54,884.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. 54,671 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఇంట్రాడేలో 55 వేల పాయింట్లకు చేరువైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 182.30 పాయింట్లు అందుకొని 16,352.45 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్
54,884
632.13
1.17 శాతం
నిఫ్టీ
16,352
182.30
1.14 శాతం