ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) వరుసగా రెండో రోజు లాభాలు మూటగట్టుకుంది. ఇవాళ్టి ట్రేడింగ్లో సెన్సెక్స్ ఒక దశలో 63,588 పాయింట్లకు చేరుకుని ఆల్ లైమ్ గరిష్ఠస్థాయిని తాకింది. ఆ తర్వాత 65 పాయింట్లు తగ్గి 0.31 శాతం లాభంతో 63,523 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తానికి 195 పాయింట్లు లాభపడింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) కూడా బుధవారం లాభాలతో ముగిసింది. నిఫ్టీ 50 కూడా 18,876 పాయింట్ల దగ్గర ఇంట్రాడే గరిష్ఠానికి చేరి ఆల్ టైమ్ గరిష్ఠస్థాయికి కేవలం 12 పాయింట్ల దూరంలో నిలిచింది. చివరికి 0.21 శాతం లాభంతో 40 పాయింట్లు లాభపడి 18,856 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని పాజిటివ్ ట్రెండే దేశీయ మార్కెట్లలో కూడా కొనసాగింది.
సెన్సెక్స్ సూచీలో పవర్ గ్రిడ్, HDFC, HDFC bank, టెక్ మహీంద్రా, TCS, విప్రో, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, L&T, HCL టెక్ షేర్లు లాభపడ్డాయి. M&M, ITC, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మారుతి, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి.