Sensex Crosses 60 K |
దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఓ మైలురాయిగా నిలిచిపోనున్నది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడేలో 60,333 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. కొద్దిసేపు మినహా రోజంతా 60 వేల పాయింట్ల పై చిలుకు వద్దే కదలాడింది. ముగింపు సమయానికి 163.11 పాయింట్ల గెయిన్ (0.27శాతం)తో 60,048.47 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్లో ఆల్టైం రికార్డ్ 17,947.65 పాయింట్ల వరకు దూసుకెళ్లింది. చివరకు ముగింపుకల్లా 30.25 పాయింట్ల లబ్ధితో 17,853.20 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఐటీ, ఆటో, రియాల్టీ స్టాక్స్ లబ్ధి పొందాయి. సెప్టెంబర్తో ముగియనున్న రెండో త్రైమాసికంలో ఐటీ దిగ్గజాలు భారీ లాభాలు గడిస్తాయని యాక్చెంజర్ ఆశాభావం వ్యక్తం చేయడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.76% లబ్ధి పొందింది. ఐటీలో బూమ్, తక్కువ వడ్డీరేట్లకే ఇంటి రుణాల లభ్యం వంటి అంశాలతో వరుసగా మూడో రోజు రియాల్టీ షేర్లు దూసుకెళ్లాయి.
మొత్తం బీఎస్ఈలో 1,329 స్క్రిప్ట్లు లాభాలు గడించగా, 1939 స్టాక్స్ నష్టాల పాలయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ అంతా నష్టాల్లోనే సాగింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్వల్పంగా తగ్గింది. గురువారం రూ.261.74 లక్షల కోట్లకు చేరుకున్న ఎం-క్యాప్ శుక్రవారం రూ.261.19 లక్షల కోట్లకు పడిపోయింది.