Sensex Closing Bell | కొత్త ఏడాది తొలిరోజు సోమవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరిన స్టాక్ దేశీయ బెంచ్ మార్కె సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు లేకపోవడం.. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 72,218 పాయింట్ల ప్రారంభమైంది. ఆ తర్వాత 72,031 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత కోలుకొని 72,561 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ గరిష్ఠానికి చేరుకోవడంతో మదుపరులు లాభాల స్వీరణకు మొగ్గుచూపారు. ఈ క్రమంలో సెన్సెక్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది.
చివరకు 31.68 పాయింట్ల లాభంతో 71,271.94 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10.50 పాయింట్ల లాభంతో 21,741.90 వద్ద స్థిరపడింది. దాదాపు 2,453 షేర్లు పురోగమించగా.. 1,298 షేర్లు పతనమయ్యాయి. 147 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో నెస్లే ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, విప్రో టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోయాయి. హెల్త్కేర్, పీఎస్యూ బ్యాంక్ ఒక్కొక్కటి 0.5 శాతం పెరగ్గా.. బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి.