హైదరాబాద్, నవంబర్ 24: ఎలక్ట్రానిక్స్ వేస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్ మిషన్ ఈ-వేస్ట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ దిగ్గజం సెలెక్ట్ మొబైల్స్. హైదరాబాద్లోని మైండ్ స్పేస్లో ఏర్పాటు చేసిన మిషన్ ఈ-వేస్ట్ను రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ వినియోగంలో పర్యావరణ, ఆరోగ్యంపై ఈ-వేస్ట్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, ఇందుకు పరిష్కారంగా మిషన్ ఈ-వేస్ట్కు సెలెక్ట్ మొబైల్స్ శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో సేకరించిన ఈ-వేస్ట్ను నిబంధనలకు అనుగుణంగా రీసైక్లింగ్ చేపట్టాలని ఆయన సూచించారు. ఈ-వేస్ట్ నిర్వహణ కేవలం పర్యావరణ హితం కోసమే కాదని, ప్రతి భారతీయ పౌరునికి అత్యవసరమన్నారు. హైదరాబాద్లో 300కి పైగా క్యాంపస్లు ఉన్నాయని, వీటిలో కూడా మిషన్ ఈ-వేస్ట్ను ఏర్పాటు చేయాలని సెలెక్ట్ ప్రతినిధులకు జయేశ్ రంజన్ సూచించారు. కారిడార్లో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ బిన్తో క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసింది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తున్నది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఈ వేస్ట్ వివరాలను పొందు పరుచాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారికి వర్చ్యూవల్గా రూ.10 వేల వరకు డిస్కౌంట్ కూపన్ లభించనున్నది. ఈ కూపన్తో సెలెక్ట్ మొబైల్ రిటైల్ అవుట్లెట్లో ఏదైనా వస్తువును కొనుగోలు చేసుకోవచ్చును.