Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా సీఈవోగా నియమితులైన కాంప్బెల్ విల్సన్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత ఆ నియామకానికి కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వనున్నది. ఈ మేరకు ఎయిరిండియా ఎండీ కం సీఈవోగా కాంప్బెల్ విల్సన్ నియామకానికి అనుమతించాలని కేంద్ర హోంశాఖకు టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా దరఖాస్తు చేసుకున్నది. ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు తమ సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీయులను నియమించుకుంటే కేంద్ర హోంశాఖ ఆమోదం తప్పనిసరి.
గత మే నెల 12న ఎయిరిండియా ఎండీ కం సీఈవోగా కాంప్బెల్ విల్సన్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటికీ కేంద్ర హోంశాఖ ఆమోదం తెలుపలేదు. ఇంతకుముందు సింగపూర్లో బడ్జెట్ ఎయిర్లైన్స్ స్కూట్ టైగర్ ఎయిర్ సీఈవోగా విల్సన్ కాంప్బెల్ పని ఏశారు. ఆయనకు పౌర విమానయాన రంగంలో 26 ఏండ్ల అనుభవం ఉంది.
గత మార్చిలో ఎయిరిండియా ఎండీ కం సీఈవోగా ఇల్కర్ ఐసీని టాటా సన్స్ నియమించింది. ఆయన అంతకుముందు టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మన్, బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన నియామకంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరాలు తెలియజేయడంతో కేంద్ర హోంశాఖ.. ఇల్కర్ ఐసీ నియామకానికి అనుమతి నిరాకరించింది.