న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ..బ్రైట్కామ్ గ్రూపునకు షాకిచ్చింది. బ్రైట్కామ్ గ్రూపు లిమిటెడ్తోపాటు కంపెనీ ప్రమోటర్ సురేశ్ కుమార్ రెడ్డిలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడాన్ని తిరస్కరించింది. కంపెనీకి చెందిన షేర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు సెబీ గుర్తించింది. దీంతో రంగంలోకి దిగిన సెబీ..సంస్థ, ప్రమోటర్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. సురేశ్ రెడ్డి, ఆయనకు సంబంధించిన కంపెనీల షేర్లు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు.