ఆధార్-పాన్ అనుసంధానంపై మదుపరులకు సెబీ ఆదేశం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఈ నెలాఖరుకల్లా ఆధార్తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను అనుసంధానం చేసుకోవాలని మదుపరులను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం ఆదేశించింది. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ నేపథ్యంలో ‘2017 జూలై 1 నాటికి పాన్ కలిగిన మదుపరులంతా ఈ నెల 30లోగా తమ ఆధార్తో పాన్ను లింక్ చేసుకోవాలి. అలా కానట్లయితే సదరు పాన్ పనిచేయనిదిగా మారగలదు’ అని సెబీ ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. సెక్యూరిటీస్ మార్కెట్లో మరింత సులువుగా లావాదేవీలను కొనసాగించడానికి ఆధార్తో పాన్ లింక్ దోహదం చేస్తుందన్నది. అలాగే ప్రస్తుతమున్న మదుపరులంతా ఆధార్తో పాన్ను లింక్ చేసుకోవడం మంచిదని సూచించింది. ఈ ప్రక్రియ నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనల్లో భాగమేనని గుర్తుచేసింది.