హైదరాబాద్, సెప్టెంబర్ 12: సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన చౌక విమానయాన సంస్థ స్కూట్.. సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. భారత్ నుంచి ప్రారంభ విమాన టికెట్టు ధరను రూ.7,600గా నిర్ణయించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 18న ముగియనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న విమాన ప్రయాణికులు ఈ నెల 19 నుంచి అక్టోబర్ 29 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది.
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ ప్రారంభ విమాన టికెట్టు ధరను రూ.8,900గా ప్రకటించిన సంస్థ..జకర్తాకు రూ.9,900, బాలీకి రూ.9,900, సింగపూర్కు రూ.9,500, హనోయ్కి రూ.10,900, సిడ్నీకి రూ.14,900, మెల్బోర్న్కు రూ.14,900, పెర్థ్కు రూ.13,900 ప్రారంభ విమాన టికెట్టు ధరలను నిర్ణయించింది.