న్యూఢిల్లీ : జూమ్, గూగుల్ మీట్, టీమ్స్ వంటి వర్చువల్ మీటింగ్ (Virtual Meetings) వేదికలను అధికంగా వాడటం పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వర్చువల్ మీటింగ్స్ మెదడు, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని తాజా అధ్యయనం బాంబు పేల్చింది. 50 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ సెషన్ బ్రైన్ యాక్టివిటీ పెరిగేందుకు దారి తీస్తుందని ఫలితంగా అలసట, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వెంటాడతాయని అధ్యయనం స్పష్టం చేసింది.
కొవిడ్-19 మహమ్మారి అనంతరం వర్చువల్ కమ్యూనికేషన్ మానవ జీవితాల్లో అంతర్భాగమైంది. జూమ్, టీమ్స్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్లు మనం వ్యాపారాలు చేసే పద్ధతి సహా, విద్యా, వైద్యం, సోషల్ కనెక్షన్స్ స్వరూపాన్ని మార్చివేశాయి. ఈ వర్చువల్ వేదికలపై మనం ఆధారపడటం పెరిగే కొద్దీ వర్చువల్ మీటింగ్స్ ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. మితిమీరిన వీడియో కాన్ఫరెన్స్లతో మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఊహించని ముప్పులు తలెత్తే అవకాశం ఉందని తాజా పరిశోధన హెచ్చరించింది.
ఒత్తిడి పెరగడం ఆపై బ్రైన్, గుండెపై స్ట్రెయిన్ పెరుగుతుందని పరిశోధన వెల్లడించింది. ముఖాముఖి ఈవెంట్స్తో పోలిస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్తో మనుషులు అలిసిపోతారని పరిశోధకులు పేర్కొన్నారని నేచర్లో ప్రచురితమైన సైంటిఫిక్ రిపోర్ట్లో వెల్లడైంది. వర్చువల్ మీటింగ్స్ ప్రభావం ఏ విధంగా ఉందనేది వీడియోకాన్ఫరెన్స్ ఫాటిగ్యు (వీసీఎఫ్)ను న్యూరోఫిజియలాజికల్ కోణంలో ఈ అధ్యయనం పరిశీలించింది.50 నిమిషాల పాటు వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న విద్యార్ధుల బ్రైన్, హార్ట్ను స్కాన్ చేసిన అనంతరం వారి నాడీ వ్యవస్ధలో మార్పులు కనిపించాయని న్యూరోఫిజియోలాజికల్ గణాంకాలు వెల్లడించాయి. స్క్రీన్ టైమ్ను తగ్గించుకోవడం, ముఖాముఖి మీటింగ్స్, ఒత్తిడికి దూరంగా ఉండటం, వర్చువల్ మీటింగ్స్లో తరచూ బ్రేక్స్ ఇవ్వడం ద్వారా ప్రతికూల ప్రభావాలను నిరోధించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Read More :