హైదరాబాద్, మార్చి 13: హైదరాబాద్ కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న సైయెంట్..ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్తో జట్టుకట్టింది. క్యాబిన్, కార్గొ ఇంజినీరింగ్ సేవలను అందించడానికి ఈ ఒప్పందం చేసుకున్నట్లు సైయెంట్ వర్గాలు వెల్లడించాయి. ఇంటిలిజెంట్ కోర్ మేనేజ్మెంట్ ప్లాట్ఫాం(ఐసీఎంపీ)ని అభివృద్ధి చేయడానికి ఎయిర్బస్ను ఎంపిక చేసినట్టు తెలిపింది.