సైరస్ మిస్త్రీ తొలగింపుపై రివ్యూ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, మే 19: టాటా గ్రూప్ కంపెనీల మాతృసంస్థ టాటా సన్స్ ఆధిపత్యానికి కొనసాగుతున్న పోరులో సుప్రీం కోర్టులో టాటాలకు ఊరట లభించింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించాలన్న టాటా గ్రూప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ 2021లో వెలువడిన తీర్పును రివ్యూ చేయాలంటూ శాపూర్జి పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వేసిన పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే 2021 మార్చిలో వెలువడిన తీర్పులో సైరస్ మిస్త్రీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది.
టాటా సన్స్లో 18 శాతం వాటా వివరాలివి…
రతన్ టాటా హర్షం
సైరస్ రివ్యూ పిటిషన్ కొట్టివేస్తూ వెలువడిన సుప్రీంకోర్టు ఉత్తర్వులపై టాటా ట్రస్ట్ల చైర్మన్ రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. దీంతో మన న్యాయవ్యవస్థ విలువల పట్ల విశ్వాసం పెంపొందుతుందని టాటా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీం ఉత్తర్వుల్ని తాము ఆహ్వానిస్తున్నామని టాటా సన్స్ వేరొక ప్రకటనలో తెలిపింది. టాటా సన్స్లో మెజారిటీ వాటా టాటా ట్రస్ట్ల వద్ద ఉండగా, 15 శాతంపైగా వాటా ఎస్పీ గ్రూప్ చేతిలో ఉంది. షాంపూర్జి పల్లోంజి అండ్ కంపెనీకి మిస్త్రీ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.